
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి
నర్సింహులపేట: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం మండలంలోని వంతడపల స్టేజీ సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా వెంటనే ధాన్యం కొనగోలు చేసి తరలించాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో డీటీ సుధాకర్నాయక్, సీసీ భీముడు తదితరులు పాల్గొన్నారు.
పరిష్కారానికి కృషి చేయాలి..
దంతాలపల్లి: మండలంలోని పేరుకుపోయిన రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని రామవరం, వేములపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. రైతుల దరఖాస్తులను పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల భూ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో తొర్రూరు ఆర్డీఓ గణేశ్, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల తహసీల్దార్లు సునీల్ కుమార్, నాగరాజు, ఆర్ఐ రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం చేస్తే చర్యలు..
మహబూబాబాద్ అర్బన్: కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంచేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యం రవాణాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లారీలను సిద్ధం చేసుకోవాలన్నారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే నిర్వాహకులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్డీఓ మధుసూదన్రాజు, డీసీఓ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, మెప్మా డైరెక్టర్ విజయకుమారి, డీఏఓ విజయనిర్మల, డీవీహెచ్ఓ మరియన్న తదితరులు పాల్గొన్నారు.
మరిపెడలో తనిఖీ..
మరిపెడ రూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. బుధవారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం, ఎల్లంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీఓ గణేశ్, జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు సైదులు, సునీల్రెడ్డి, మరిపెడ పీఏసీఎస్ చైర్మన్ చాపల యాదగిరిరెడ్డి, సీసీ రుక్మిణి, సీఈఓ నరేష్, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్