
బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ అభినందనలు
హన్మకొండ : బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అభినందించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో పాటు నాయకులు కేటీఆర్ను కలిశారు. సభ విజయవంతానికి నాయకులు శ్రమించారని కేటీఆర్ వారిని అభినందించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎ మ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.