సాయుధ బలగాలను ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సాయుధ బలగాలను ఉపసంహరించుకోవాలి

May 7 2025 12:39 AM | Updated on May 7 2025 12:39 AM

సాయుధ బలగాలను ఉపసంహరించుకోవాలి

సాయుధ బలగాలను ఉపసంహరించుకోవాలి

నెహ్రూసెంటర్‌: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రిగుట్ట ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాయుధ బలగాలను ఉపసంహరించుకోవా లని, మావోయిస్టులతో తక్షణమే చర్చలు జరిపి ఆపరేషన్‌ కగార్‌నునిలిపివేయాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌, ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వామపక్ష పార్టీల నేతలు బి.విజయసారథి, గునిగంటి రాజన్న, సనప పొమ్మన్న, నందగిరి వెంకటేశ్వర్లు, బుర్ర ఆనంద్‌, కొత్తపల్లి రవి, కంచ వెంకన్న మాట్లాడుతూ.. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఆదివాసీ, గిరిజనులపై చేపట్టిన హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే విరమించుకోవా లని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 9న జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. బి.అజయ్‌సారథిరెడ్డి, రాజమౌళి, భాస్కర్‌రెడ్డి, రా మ్మోహన్‌, కుమార్‌, రాంమూర్తి, నవీన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement