
కేసముద్రంలో గాలివాన బీభత్సం
మానుకోట మండలం ముడుపుగల్ కొనుగోలు కేంద్రంలో పరదాలు కప్పిన ధాన్యం రాశులు
వాన గుబులు..
కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతుల్లో వాన గుబులు నెలకొంది. రెండు రోజులుగా రాత్రిపూట గాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. దీంతో సాయంత్రం కాగానే కుప్పలు చేయడం మళ్లీ ఉదయం వాటిని ఎండబెట్టడం రైతులకు ఇబ్బందిగా మారింది. కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
–సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్
కేసముద్రం: కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో సోమవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో కేసముద్రం వ్యవసాయ మా ర్కెట్లో ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. అదే విధంగా ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అడుగులు తడిశాయి. వర్షసూచన ఉండడంతో మార్కెట్, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ముందస్తుగా ధాన్యం రాశులపై టార్పాలిన్లు, పరదాలు కప్పుకున్నారు. అయినప్పటికీ వర్షం కారణంగా అడుగులు తడిశాయి. దీంతో మంగళవారం ఉదయం రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబోసుకుంటూ తీవ్ర ఇబ్బ ందులు పడ్డారు. అదే విధంగా ఆయా గ్రామాల్లో గాలివాన బీభత్సానికి ఇంటిపైకప్పు రేకులు లేచిపడగా, పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.
మార్కెట్లో తడిసిన ధాన్యం

కేసముద్రంలో గాలివాన బీభత్సం

కేసముద్రంలో గాలివాన బీభత్సం