
వేసవి శిక్షణతో విద్యార్థుల్లో ఆరోగ్య వికాసం
● డీఈఓ రవీందర్రెడ్డి
తొర్రూరు: వేసవి శిక్షణతో విద్యార్థుల్లో ఆరోగ్య వికాసం సాధ్యమని డీఈఓ రవీందర్రెడ్డి తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు కొనసాగనున్న వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఈఓ ప్రారంభించారు. ఈ నెల 20 వరకు పలు అంశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు శిక్షణ అందించనున్నారు. ఎంఈఓ బుచయ్యతో కలిసి డీఈఓ మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ శిబిరాలు దోహదపడతాయన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించేందుకు శిబిరం తోడ్ప డుతుందన్నారు. హెచ్ఎం జెల్ల లక్ష్మీనారాయణ, పీడీ ప్రవీణ్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
నైపుణ్యం పెంపొందించేందుకే..
తొర్రూరు రూరల్: విద్యార్థుల్లో మరింత నైపుణ్యాన్ని పెంపొందించేందుకే వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చెర్లపాలెం, మాటేడు, అమ్మాపురం, అరిపిరాల హైస్కూళ్లలో విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ప్రతీరోజు ఉదయం 8నుంచి 10.30 గంటల వరకు తరగతులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా ఇండోర్ గేమ్స్, స్పోకెన్ ఇంగ్లిష్, బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్, సైన్స్ ఎక్స్పర్మెంట్స్, డ్రాయింగ్ స్కిల్స్, క్రాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్, డ్యాన్స్, వాలీబాల్, షటిల్, క్యారమ్ వంటి క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.