
పద్దెనిమిదేళ్లకు ఎల్లమ్మ జాడ..
● 10న కేరళ టు తెలంగాణకు రాక
● సోషల్ మీడియా ప్రభావంతో నిర్ధారణ
దేవరుప్పుల : మతిస్థిమితం కోల్పోయి పద్దెనిమిదేళ్ల క్రితం తప్పిపోయిన చింత ఎల్లమ్మ ఎట్టకేలకు మరో ఐదు రోజుల్లో స్వగ్రామానికి చేరుకోనుంది. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన చింత వెంక మ్మ, సోమయ్య కూతురుకు రఘునాథపల్లి కన్నాయిపల్లికి చెందిన వ్యక్తితో వివా హం చేశారు. ఈమెకు ఇద్దరు కుమారులు జన్మించాక మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తిరిగి వేసారిపోయారు. ఈ క్రమంలో కేరళలోని ఓ క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ ఆశ్రమంలో ఉంటున్న ఎ ల్లమ్మను నిర్వాహకులు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎల్ల మ్మ తమదీ దేవరుప్పుల కట్టకాడీ ఇల్ల్లు అని, అత్తగారు కన్నాయిపల్లె అని, ఇద్దరు కొడుకులు ఉన్నారని, ఇద్దరు అమ్మలు ఉన్నారని పేర్కొన్న విషయాలను వీడియో రూపంలో వైరల్ చేశారు. దీంతో ఈ విషయమై అప్పిరెడ్డిపల్లె మాజీ సర్పంచ్ పులిగిళ్ల సుధాకర్ కేరళలో తనకు పరిచయం ఉన్న క్రైస్తవ మతపెద్దలతో మాట్లాడారు. ఎట్టకేలకు ఎల్లమ్మ మాదిరి తప్పిపోయి అక్కడ ఉంటున్న ఐదుగురు మహిళల్లో నలుగురు ఆంధ్రప్రదేశ్, ఒకరు తెలంగా ణ వాసీగా ఆశ్రమ నిర్వాహకులు నిర్ధారించుకున్నా రు. ఈ నెల 10వ తేదీన వారి వారి స్వగ్రామాలకు వచ్చి అప్పజెప్పేందుకు వస్తున్నట్టు సుధాకర్ తెలిపారు.