
ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు
● హైకోర్టు జడ్జి జస్టిస్ రాజేశ్వరరావు
మహబూబాబాద్ రూరల్ : జీవితంలో సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, వాటి నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలని హైకోర్టు జడ్జి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఆత్మహత్యలు–నివారణ సదస్సు కరపత్రాలను జిల్లా కేంద్రంలోని అడ్వకేట్స్ కాలనీలో హైకోర్టు జడ్జి రాజేశ్వరరావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవించడానికే జీవితం అని, ఆత్మహత్యలకు పాల్ప డొద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో త్వరలో పోలీసుల సహకారంతో ఆత్మహత్యలు–నివారణ సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కానిస్టేబుల్ కుటుంబానికి అండగా..
వరంగల్ క్రైం : ఆకస్మికంగా మృతిచెందిన కానిస్టే బుల్ కుటుంబానికి తమవంతు బాధ్యతగా సేకరించిన ఆర్థికసాయాన్ని సోమవారం వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ అందజేశారు. కమిషనరేట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బండారి కిరణ్ కుమార్ గతేడాది మరణించాడు. దీంతో తమ మిత్రుడి కుటుంబానికి అండగా ఉండాలనే ఆలోచనతో 2013 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుళ్లు వరంగల్ కమిషనరేట్, ఆదిలాబాద్ జిల్లా పోలీస్ కానిస్టేబుళ్లతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది రూ.2.50 లక్షల రికరింగ్ డిపాజిట్ పత్రాలతో పాటు రూ.37వేల నగదు ను సీపీ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అదనపు డీసీపీ సురేష్ కుమార్, ఆర్ఐ సింహాచలం శ్రీనివాస్, కానిస్టేబుళ్లు శివ, రాజు పాల్గొన్నారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు.!
ఏటూరునాగారం : మండల కేంద్రంలోని జంపన్నవాగు కరకట్ట సమీపంలో ఓ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని గుర్తించిన అదే ప్రాంతానికి చెందిన అన్వర్ ఈనెల 2వ తేదీన రాత్రి 10:45లకు తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు. గమనించిన సదరు వ్యక్తులు అన్వర్పై దాడి చేసి సెల్ఫోన్ను లాక్కొని వీడియోలు, ఫొటోలు డిలిట్ చేసినట్లు బాధితుడు అన్వర్ తెలిపారు. ఇదే విషయంపై సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్ల డించారు. అసలు గుప్తనిధుల కోసం తవ్వారా? లేదా వారి ఇంటి అవసరాల కోసమా అనేది పోలీసులు విచారణ చేపట్టి తేల్చాల్సి ఉంది. కానీ గ్రామంలో మాత్రం గుప్తనిధుల కోసమే తవ్వినట్లు వినికిడి. అంతేకాకుండా బంగారు బిల్ల లు కూడా దొరికినట్లు పుకార్లు షికార్లయ్యాయి. ఈ విషయంపై ఎస్సైను వివరణ కోరగా అన్వర్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు