
మూడు రోజులైతే మళ్లీ విధుల్లోకి..
కొత్తగూడ : కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చాడు. ఉగ్రవాదుల చర్యతో సెలవులు రద్దయ్యాయి.. మూడ్రోజులైతే మళ్లీ విధుల్లో చేరేవాడు. ఉన్న రెండ్రోజులు బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకు వెళ్లి సంతోషంగా గడపాలనుకున్నాడు.. కాని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. గంగారం మండలం అందుగుల గూడెం గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మద్దెల ప్రకాశ్(32) ఉద్యోగంలో చేరినప్పటి నుంచి దేశ రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తూ గ్రామస్తులతో కలివిడిగా ఉండేవాడు. గోవిందాపూర్ గ్రామంలో శుభకార్యానికి బంధువుల ఇంటికి ఆదివారం వెళ్లిన అతను రాత్రి తిరిగి వస్తుండగా పెగడపల్లి సమీప మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రకాశ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఎస్సై కుశకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సెలవులపై వచ్చిన జవాన్..రోడ్డు ప్రమాదంలో మృతి
అందుగులగూడెంలో విషాదం

మూడు రోజులైతే మళ్లీ విధుల్లోకి..