
ముగిసిన సృజనోత్సవం
విద్యారణ్యపురి: జనవిజాన వేదిక(జేవీవీ) ఆధ్వర్యాన హనుమకొండ ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో ఐదురోజులుగా నిర్వహిస్తున్న వేసవి సృజనోత్సవం ఆదివారం ముగిసింది. ‘భౌతిక శాస్త్రంలో మెళకవలు’ అనే అంశంపై సుతా రి రమేశ్ అవగాహన కల్పించారు. ఆర్పీ శాగంటి మంజుల విద్యార్థులకు డ్రాయింగ్ నైపుణ్యాలను నేర్పించారు. యోగాచార్యులు డాక్టర్ లింగమూర్తి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. బుచ్చిరాములు మ్యాజిక్ తరగతులను నిర్వహించారు. ఈ వేడుకల్లో ముగిసిన సృజనోత్సవ వేడుకలు భాగంగా నిర్వహించిన పాటలు, నృత్యం, ఉపన్యాసం, చిత్రలేఖనం, చదరంగ పోటీల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చివరగా శాస్త్రవేత్తలలో ముఖాముఖి నిర్వహించారు. వరంగల్ నిట్ విశ్రాంత ఆచార్యులు సీవీ.రామారావు, ప్రొఫెసర్ ఆంజనేయులు, సుమలత, ఎంఈఓ భిక్షపతి, ఉపాధ్యాయులు కిరణ్, లింగమూర్తి, జేవీవీ ప్రధాన కార్యదర్శి రామంచ భిక్షపతి, బాధ్యులు వేణు, వకుళాభరణం శ్రీనివాస్ పాల్గొన్నారు.