హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి

May 5 2025 8:12 AM | Updated on May 5 2025 8:12 AM

హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి

హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి

మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు శేఖర్‌శర్మ, పవన్‌కుమార్‌, ఈశ్వర్‌చంద్‌ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. సంతానం లేని దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement