
సమస్యల పరిష్కారమే లక్ష్యం
డోర్నకల్: రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మజ్దూర్ యూనియన్ పనిచేస్తోందని ఆ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ రవీందర్ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలోని మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో శనివారం డోర్నకల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ కమిటీ సమావేశంలో ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యల గురించి చర్చించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా మజ్దూర్ యూనియన్ పని చేస్తుందన్నారు. అనంతరం బ్రాంచి యూత్ కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డోర్నకల్ బ్రాంచ్ సెక్రటరీ అంజియాదవ్, చైర్మన్ చరణ్నాయక్, వరంగల్, కాజీపేట బ్రాంచుల సెక్రటరీలు ఆవుల యుగేందర్, రాజేందర్, నాయకులు కిషోర్, భాస్కర్రావు, కరణ్సింగ్, నాగశేషు, రమేష్బాబు, శోభన్ప్రసాద్, వంశీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర
కార్యదర్శిగా సత్యనారాయణ
మహబూబాబాద్ రూరల్: ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయిత గుర్రపు సత్యనారాయణ నియామకమయ్యారు. ఈమేరకు సంస్థ సీ ఈఓ కత్తిమండ ప్రతాప్ శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈనెల 10, 11 తేదీల్లో ఏలూరులో అ త్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు సా హితీ సంబురాలు..సాహితీ పట్టాభిషేక మహోత్సవాలు జరుగనున్నాయని పేర్కొన్నారు.
ఆరోగ్య కార్యకర్తలు
నిబద్ధతతో పనిచేయాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: వేసవికాలం, రానున్న వర్షాకాలంలో హెల్త్ అసిస్టెంట్లు, ఆరోగ్య కార్యకర్తలు నిబద్ధతతో సమర్థవంతంగా పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో హెల్త్ అసిస్టెంట్ల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వేసవిలో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గర్భిణుల్లో రక్తహీతనను గుర్తించి ఐరన్ ట్యాబ్లెట్లు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జీజీహెచ్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి, గూడూరు సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సారంగం, సుధీర్రెడ్డి, లక్ష్మీనారాయణ, నాగేశ్వర్రావు, మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచాలి
నెల్లికుదురు: ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ వైద్యులకు సూచించారు. స్థానిక పీహెచ్సీలో వైద్యాధికారులు, సిబ్బంది శుక్రవారం సమన్వయంతో ఓ మహిళకు నార్మ ల్ డెలివరీ చేశారు. దీంతో శనివారం పీహెచ్సీని సందర్శించిన డీఎంహెచ్ఓ ఆరోగ్యంగా ఉన్న తల్లి పాపను పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశమై పలు సూచనలు సలహాలు అందించారు. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించి పేదలకు వైద్యం అందించాలన్నారు. ఎండకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రూ.6 కోట్లకు ఐపీ దాఖలు
ఖమ్మం లీగల్: జిల్లా కేంద్రానికి చెందిన మ షాట్టి నాగేశ్వరరావు రూ.6,37,21,858కు గా ను దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశాడు. మహబూబాబాద్తో పాటు ఖమ్మం జిల్లా పరి ధిలో ధాన్యం వ్యాపారం చేసిన ఆయన పలువు రి వద్ద అప్పులు తీసుకున్నాడు. ప్రస్తుతం తనకు వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందంటూ న్యాయవాది ఎం.జె.ప్రవీణ్ కుమార్ ద్వారా ఖమ్మం సీనియ ర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం దివాలా పిటిషన్ దాఖలు చేశాడు. కాగా, పిటిషన్లో 30 మందిని ప్రతివాదులుగా చేర్చాడు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం