అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

May 2 2025 12:43 AM | Updated on May 2 2025 12:43 AM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

కాటారం: అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు అందజేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంత్రి స్వగ్రామ మైన మండలంలోని ధన్వాడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బొడిగె భాగ్య, చేకూర్తి పావని, ఆత్కూ రి దుర్గ, తాటి పల్లవి ఇంటి నిర్మాణానికి కలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు గురువా రం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు దశల వారీగా స్థలాలు కలిగిఉన్న అర్హుళకు ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంథని నియోజవకర్గం కా టారం సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాలకు మొదటి విడతలో భాగంగా 1,773 ఇళ్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో పదేళ్లలో పేదల సొంతింటి కల నెరవేరలేదని అన్నారు. మొదటి దశలో స్థలం ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విడతల వారీగా ప్రతి నిరుపేదకు ఇళ్లు కట్టించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణాలను సబ్‌ కలెక్టర్‌ నిత్యం పర్యవేక్షించి త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. నిర్మాణ ప్రగతి ఫొటోలను సంబంధిత అధికారులు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని తప్పుడు ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో చేపట్టిన కు లగణన దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టే ఆలోచనకు రాష్ట్రం ది క్సూచి అయిందన్నారు. అనంతరం విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన బడిబాట కా ర్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పలువురు చిన్నారులను పలకరించి ఏ పాఠశాలలో చదువుతున్నా రు.. ఏ తరగతి చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల ను హైదరాబాద్‌, ఢిల్లీ స్థాయిలో పంపిస్తామని తెలి పారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించాలని సూచించారు. కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, గృహ నిర్మాణశాఖ పీడీ లోకిలాల్‌, డీఆర్‌డీఓ నరేశ్‌, డీపీఓ వీరభద్రయ్య, తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీఓ బాబు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, సమ్మయ్య, మహేశ్‌ పాల్గొన్నారు.

దేశవ్యాప్త కులగణన ఆలోచనకు

రాష్ట్రమే దిక్సూచి

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ

మంత్రి శ్రీధర్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement