విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

Mar 21 2024 1:20 AM | Updated on Mar 21 2024 1:20 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకొని ఉన్నత చదువులు చదవాలని డీఈఓ రామారావు అన్నారు. మానుకోట మున్సిపల్‌ పరిధిలోని అనంతారం మోడల్‌ స్కూల్‌ను డీఈఓ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో వసతులు, విద్యాబోధన, మధ్యాహ్న భోజనం వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదో తరగతి విద్యార్థులు వేసవి సెలవుల్లో ముందస్తుగా పదో తరగతి పుస్తకాలను చదవాలని సూచించారు. విద్యార్థులు చెరువులు, వాగులు, కుంటల వద్దకు ఈతకు వెళ్లొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ అమరావతి,అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement