TS Mahabubabad Assembly Constituency: TS Election 2023: 'వచ్చిపోయేటోళ్ల మాటలు నమ్మొద్దు' : ఎర్రబెల్లి దయాకర్‌రావు
Sakshi News home page

TS Election 2023: 'వచ్చిపోయేటోళ్ల మాటలు నమ్మొద్దు' : ఎర్రబెల్లి దయాకర్‌రావు

Aug 28 2023 1:12 AM | Updated on Aug 28 2023 11:01 AM

- - Sakshi

మహబూబాబాద్‌: ఎన్నికల సమయంలో వచ్చిపోయేటోళ్ల మాయమాటలు నమ్మొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం శ్రీ తులసి మండల సమాఖ్య సంఘం ఏడో వార్షిక మహాసభ నిర్వహించగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు.

తాను వచ్చాకే పాలకుర్తి నియోజకవర్గం ఎంతో ప్రగతి సాధించిందని చెప్పారు. మీరంతా ఆశీర్వదిస్తే మిగిలిన పనులు పూర్తిచేస్తానన్నారు. ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం, రాష్ట్రం బాగుపడుతుందన్నారు. 114 సమాఖ్య సంఘాలకు లింకేజీ రుణాలు రూ.7కోట్లు, సమాఖ్య సంఘాల్లోని 50 స్వయం సహాయక సంఘాలకు శ్రీనిధి రుణాల రూ.2 కోట్లు చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

వచ్చే నెల 8వ తేదీన తొర్రూరులో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నమన్నారు. అర్హత ఉన్నవారందరికీ ఉద్యోగాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, సర్పంచ్‌ వెనుకదాసుల లక్ష్మీ రామచంద్రయ్య శర్మ, నాయకులు ఈదురు ఐలయ్య, శ్రీరాం సుధీర్‌, సంజయ్‌, శ్రీనివాస్‌, సల్లెండి సుధాకర్‌, మల్లికార్జున్‌ చారి, జ్ఞానేశ్వర్‌ చారి, చిలుక భిక్షపతి, జిల్లా, మండల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement