హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) నీటిని కడ్లమాగి వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నిల్వ ఉంచినా హొళగుంద గ్రామంలోని ఫిల్టర్బెడ్ సరఫరా కావడం లేదు. దీంతో మంచినీటి ఎద్దడి తలెత్తింది. పంచాయతీ వారు ట్యాంకర్ ఏర్పాటు చేసినా నీరు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలుగా మంచినీటి కోసం పనులకు, పొలాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండాల్సి వస్తోందని తెలిపారు. ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ఫిల్టర్బెడ్కు సక్రమంగా నీరు రావడం లేదని పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్గౌడ్ చెప్పారు.


