● కర్నూలుకు చెందిన శ్రీనివాసులు ఇటీవల పెద్దాసుపత్రికి ఎదురుగా ఉన్న ఓ మందుల దుకాణంలో ఐవీ కిట్ను కొనుగోలు చేశాడు. 20 శాతం డిస్కౌంట్ ఇచ్చి రూ.329 బిల్లు వేశారు. వీటి విలువ గురించి తెలిసిన అతను వెనక్కి ఇచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరిక్ మందుల దుకాణంలో వాటిని కొనుగోలు చేయగా రూ.70కే ఇచ్చారు. దీనివల్ల అతనికి రూ.250 ఆదా అయ్యింది. శ్రీనివాసులుకు మందుల గురించి తెలుసు కాబట్టి మోసపోలేదు.
.. అయితే జిల్లాలో మందుల వ్యాపారం గురించి తెలియక డిస్కౌంట్ పేరుతో రోజూ వేలాది మంది మోసపోతున్నారు.
ఆఫర్ పేరిట అ‘ధనం’ వసూలు!
ఆశ చూపి ముంచేస్తున్న మందులోళ్లు
పీడీసీ మందులే అధికం
బ్రాండెడ్ కంటే వీటి ధరలు ఎక్కువ
మోసపోతున్న వినియోగదారులు


