
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. అమావాస్య కావడంతో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక భక్తులు భారీగా వచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల దర్శనార్థం శ్రీమఠం అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శ్రీమఠం ప్రాంగణంలో రాఘవేంద్రుల మూలబృందవన ప్రతిమను బంగారు పల్లికీలో కొలువుంచి భక్తజనం మధ్య ఊరేగించారు.
శ్రీమఠం కారిడార్లో భక్తుల కోలాహలం