
పీఆర్ క్యూసీ డీఈఈగా భాస్కరరెడ్డి
కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం డివిజన్ –1 ఇన్చార్జ్ ( పూర్తి అదనపు బాధ్యతలు) డీఈఈగా ఎన్వీ భాస్కరరెడ్డి నియమితులయ్యారు. ఇప్పటివరకు రెగ్యులర్ డీఈఈగా విధులు నిర్వహించిన వీ.రవీంద్రారెడ్డి ఆదివారం పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలోనే కార్యాలయంలోనే అసిస్టెంట్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్రెడ్డికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాలని పీఆర్ ఈఎన్సీ బాలునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోఆదివారం స్థానిక జెడ్పీలోని క్యూసీ కార్యాలయంలో డీఈఈగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఏఈ అమర్నాథ్, కార్యాలయ సీనియర్ సహాయకులు బీ.గిడ్డమూర్తి పాల్గొన్నారు.