
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ నాడు నిర్వహించిన పంచాంగ శ
కర్నూలు(అర్బన్): నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక, ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టారు. కొత్త ఉద్యోగాల కల్పన మాట దేవుడెరుగు, గత ప్రభుత్వంలో నియమించిన చిరుద్యోగులను రోడ్డున పడేశారు. దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన వలంటీరు వ్యవస్థకు రూపమే లేదని ఎత్తేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను అర్హులైన పేద, మధ్య తరగతి వర్గాల దరికి చేర్చిన వలంటీర్లపై కూటమి ప్రభుత్వం కుట్ర చేసి వారిని శాశ్వతంగా ఇళ్లకు పంపింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, పారితోషకం కూడా రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని నమ్మబలికింది. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వారికి వేతనాలను నిలిపి వేయడంతో పాటు వలంటీర్ల వ్యవస్థకు జీఓనే లేదని తేల్చేసింది. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వలంటీర్లు రోడ్డెక్కి ఆందోళనలను చేసినా, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
కూటమి ప్రభుత్వ కాఠిన్యం
తెల్లవారక ముందే అవ్వా, తాతలను నిద్రలేపి నిస్వార్థంగా పెన్షన్లు అందించిన వలంటీర్ల సేవలను రాజకీయ స్వార్థం కబళించింది. పిల్లల చదువులకు అవసరమైన సర్టిఫికెట్లను ఇంటి ముంగిట్లోనే అందించిన వారిపై వేటు వేసింది. అనేక సంక్షేమ పథకాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అతి తక్కువ గౌరవ వేతనంతో అర్హులైన పేద, మధ్య తరగతి ప్రజలకు అందించిన వలంటీర్లపై కరుణ చూపించాల్సింది పోయి, కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది. కరోనా కష్టకాలంలో సొంత కుటుంబ సభ్యులు కూడా తమ వారి వద్దకు వెళ్లి మంచి నీళ్లు, ఆహారం, మందులను అందించలేని పరిస్థితుల్లో కూడా వలంటీర్లు తమ కుటుంబాలను, ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు విశేష సేవలు అందించారు. అయితే అప్పట్లో వారు చేసిన సేవలకు కూటమి ప్రభుత్వం శాశ్వత సెలవు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జిల్లాలో దాదాపు 10వేల వలంటీర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేలు వేతనం అందించాలని, పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాన్ని అందించాలని వారు చేస్తున్న డిమాండ్ అరణ్యరోదనగా మిగిలిపోయింది.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్ల సేవలకు అవార్డులు
వలంటీర్లు అందించిన సేవలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. నగదును అందించి ఘనంగా సన్మానించింది. వారు అందించిన సేవలకు గుర్తుగా సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రలుగా విభజించి అవార్డులను అందించింది. గత ఏడాది ఫిబ్రవరిలో గతంలో ఉన్న అవార్డుల మొత్తాన్ని పెంచుతూ ఏకంగా సేవా వజ్రకు రూ.45 వేలు, సేవా రత్నకు రూ.30 వేలు, సేవా మిత్రకు రూ.15 వేలను అందించి గౌరవించడం విశేషం.