రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం

May 26 2025 1:18 AM | Updated on May 26 2025 1:18 AM

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం

ఆళ్లగడ్డ: పట్టణ శివారులోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. రూరల్‌ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కోవెలకుంట్ల పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శేఖర్‌ (30) అదనపు విధుల్లో భాగంగా శనివారం రాత్రి క్యూఆర్‌టీంతో కలిసి చాగలమర్రి టోల్‌ప్లాజా దగ్గర విధులు పూర్తి చేసుకుని ఆదివారం తెల్లవారు జామున కోవెలకుంట్లకు వెళ్లేందుకు హైవే పెట్రోలింగ్‌ వాహనంలో ఆళ్లగడ్డ హైవే డాబా దగ్గరకు వచ్చాడు. అక్కడి నుంచి ఆళ్లగడ్డకు వచ్చేందుకు అటుగా వస్తున్న మోటర్‌ సైకిల్‌ను ఆపి ఎక్కి వస్తుండగా కొంచెం దూరం వచ్చేసరికి వెనుక వైపునుంచి వస్తున్న పాల లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగ గాయపడ్డ కానిస్టేబుల్‌ శేఖర్‌ను స్థానిక వైద్యశాలకు తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం నంద్యాల వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతుడికి భార్య ప్రవళిక, నాలుగు సంవత్సరాల కొడుకు, ఏడాది వయస్సున్న కూతురు ఉన్నారు.

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

కానిస్టేబుల్‌ శేఖర్‌ అంత్యక్రియలు ఆదివారం చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలోని శ్మశాన వాటికలో పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. డీఎస్పీ ప్రమోద్‌, సీఐ మురళీధర్‌రెడ్డి పర్యవేక్షణలో ఏఆర్‌, సివిల్‌ పోలీసులు గౌరవ వందనం చేశారు.

ఆళ్లగడ్డ పట్టణ శివారులోని

హైవేపై ఘటన

అధికారిక లాంఛనాలతో

అంత్యక్రియలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement