టీడీపీ నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు

May 26 2025 1:18 AM | Updated on May 26 2025 1:18 AM

టీడీప

టీడీపీ నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు

పాణ్యం: మండల పరిధిలోని భూపనపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు హనమంతుపై పోలీసుల స్టేషన్‌లో గ్రామ కార్యదర్శి శ్రీనివాసులు ఫిర్యాదు చేసినట్లు ఈఓఆర్డి చంద్రమౌళేశ్వర్‌గౌడ్‌ ఆదివారం విలేకరులకు తెలిపారు. భూపనపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులో అక్రమంగా చేపలు అమ్ముకున్నారని, దీంతో గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో గ్రామ కార్యదర్శి శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.

జాతీయ స్థాయి ఉషూ పోటీలకు ఎంపిక

కర్నూలు (టౌన్‌): ఈనెల 26 నుంచి 31 వరకు తమిళనాడు రాష్ట్రంలోని ఈ–రోడ్డులో నిర్వహిస్తున్న 25 వ జాతీయ స్థాయి సబ్‌ జూనియర్‌ ఉషూ పోటీలకు కర్నూలు విద్యార్థులు ఎంపికయ్యారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎంపికై న సాయిదామిని, సాయి తన్మయ్‌, షేక్‌ షాజిదా, యశిత రెడ్డి, ఉదయశ్రీ, రిషీ మహేందర్‌, సాధిక్‌, సాయి ఆరవింద్‌ను జిల్లా ఉషూ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, కోచ్‌ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.

చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌

నూతన కార్యవర్గం ఎన్నిక

కర్నూలు(హాస్పిటల్‌): చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంస్థ అధ్యక్షులు ఐ.విజయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో ఆదివారం 59వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గౌరవ చైర్మన్‌గా టీజీ వెంకటేష్‌, ఆడిటర్‌గా బుచ్చన్న, కోశాధికారిగా కె.మురళీధర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరిగా ఎస్‌.నరేంద్రలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వర్తకుల సమస్యలను సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఓంప్రకాష్‌, గురుస్వామి, టీవీ రత్నప్రసాద్‌, డివి.రమణ, జగదీష్‌, మారం అనిల్‌, జగన్నాథగుప్త, సుబ్రహ్మణ్యం, బదరినారాయణ పాల్గొన్నారు.

ముగిసిన క్రెడాయ్‌ ప్రాపర్టీ షో

కర్నూలు (టౌన్‌): నగరంలోని ఎస్‌టీబీసీ కళాశాల మైదానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ఆదివారం సాయంత్రం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌. రవీంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ రంగ అభివృద్ధికి క్రెడాయ్‌ నిర్వహిస్తున్న ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆస్తి కోనుగోలు చేయాలనుకోనే వారికి చక్కని వేదిక క్రేడాయ్‌ ఏర్పాటు చేసిందన్నారు. ఇలాంటి ప్రదర్శనలు కర్నూలు పరిసర ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. క్రెడాయ్‌ ప్రాపర్టీ ప్రదర్శన పురస్కరించుకొని నిర్వహించిన లక్కీ డిప్‌ విజేతలకు బంగారు నాణం, ఇతర వస్తువులు అందజేశారు. క్రెడాయ్‌ సంస్థ అధ్యక్షులు సురేష్‌కుమార్‌ రెడ్డి, కన్వీనర్‌ శ్రీనివాసరావులు మాట్లాడుతూ.. ప్రాపర్టీ ప్రదర్శనకు మంచి ఆదరణ లభించిందన్నారు. గణనీయమైన వ్యాపార లావాదేవీలు జరిగాయన్నారు. ప్రతి ఒక్కరి ఇంటి కలను క్రెడాయ్‌ కల్పించేందుకు ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్‌ సంస్థ కార్యదర్శి గోవర్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు.

టీడీపీ నాయకుడిపై  పోలీసులకు ఫిర్యాదు 1
1/2

టీడీపీ నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు

టీడీపీ నాయకుడిపై  పోలీసులకు ఫిర్యాదు 2
2/2

టీడీపీ నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement