
పడితే ఇంటికొచ్చేది శవమే..
కూటమి ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల పేరిట ప్రజలను నిలువునా మోసం చేసింది. గుంతలు పడిన రోడ్లను హడావుడి పనులతో సరిపెట్టారు. మూడు నెలలు గడవక ముందే ఆ పనుల్లో నాణ్యత తేలిపోయింది. పత్తికొండ–గుత్తి రహదారిలో ప్రయాణం చేయాలంటేనే భయమేస్తుంది. ఇప్పుడు వర్షాలు పడుతుండటంతో ఏ గుంత ఎంత లోతు ఉందో కూడా తెలియడం లేదు. పడితే ఇంటికి వచ్చేది శవమే. తాము అధికారంలోకి వస్తే రోడ్లను మెరిపిస్తామని నమ్మబలికారు. ఇప్పుడు చూస్తే గుంతల రోడ్లపై మా చావుకు వదిలేశారు.
– సోమశేఖరరెడ్డి, జొన్నగిరి