
క్యూఆర్ కోడ్తో వైద్యసేవలపై అభిప్రాయం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అందే వైద్యసేవలపై క్యూఆర్ కోడ్తో రోగులు, వారి కుటుంబసభ్యులు అభిప్రాయాన్ని చెప్పవచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ కౌంటర్, ఎంసీహెచ్, పీడియాట్రిక్, ఫిజియోథెరపి, శుశ్రుత భవన్ తదితర విభాగాల్లో పర్యటించి వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని పలు ఓపీ, ఐపీ విభాగాలకు వచ్చే రోగులకు అందుతున్న వైద్యసేవల అభిప్రాయాన్ని క్యూఆర్ కోడ్లో నమోదు చేసుకునే విధంగా రోగులకు అవగాహన ఇవ్వాలని వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి సూచించారు. శుశ్రుత భవన్, సర్జికల్ విభాగంలోని ఆపరేషన్ థియేటర్లో పర్యటించి యూ నిట్ వారీగా ఎన్నెన్ని సర్జరీలు చేస్తున్నారనే దానిపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి తప్పనిసరిగా ఆధార్కార్డు, అభా కార్డు తీసుకుని వస్తే ఓపీ నమోదు ప్రక్రియ, ఇతర సేవలు వేగంగా అందుతా యని చెప్పారు. ఈ విషయమై రోగులకు, వారి కుటుంబసభ్యులకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీరాములు, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ శివబాల నాగాంజన్, డాక్టర్ కిరణ్కుమార్, డాక్టర్ సునీల్ ప్రశాంత్ ఉన్నారు.