
అధికారులు ఈ వంక చూడరు?
● యథేచ్ఛగా వాగులు, వంకలు కబ్జా చేస్తున్న కూటమి నేతలు ● వంక పోరంబోకు స్థలంలో షెడ్లకు ఇంటి నంబర్ల కేటాయింపు
డోన్: ఖాళీ జాగా కనిపిస్తే చాలు కూటమి నేతలు పాగా వేస్తేన్నారు. వాగులు, వంకలను సైతం వదలడం లేదు. రాత్రిరాత్రికి ఆక్రమణకు గురవుతున్నా అధికారులు అటు వైపు కన్నెతి చూడటం లేదు. అంతేకాకుండా కొందరు అధికారులు ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారు. కూటమి నేతల ఆక్రమణలకు చెరువులు సైతం ఒట్టిపోయే ప్రమాదం పొంచి ఉంది. డోన్ పట్టణ నడిబొడ్డున ఉన్న బోగందాని వంక.. కొచ్చెర్వు చెరువు, వెంకటాపురం, ఉడుములపాడు, జగదుర్తి చెరువులకు సమృద్ధిగా నీరందించేది. ఈ వంకను పూడ్చేందుకు కొందరు టీడీపీ నాయకులు పూడ్చివేస్తున్నారు. మరోవైపు వంకను ఆనుకొని ఓ టీడీపీ కార్యకర్త రేకులషెడ్డును నిర్మించి నిబంధనలకు విరుద్ధగా మున్సిపాలిటీ నుంచి ఇంటి నంబర్ను పొందడం జరిగింది. ఈ ప్రాంతంలో సెంటు స్థలం రూ.10 లక్షల ధర పలుకుతుండటంతో టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మకై ్క ఇంటి నంబర్ పొందేందుకు పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. దీంతో వంక నానాటికి ఆక్రమణతో కుశించికుపోయి నీటి ప్రవాహం నిలిచిపోయి చెరువులకు నీరందని పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే మైనర్ ఇరిగేషన్ అధికారులు ఈ వంక వెంట వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. లేకపోతే లోతట్టు కాలనీలు జలమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

అధికారులు ఈ వంక చూడరు?

అధికారులు ఈ వంక చూడరు?

అధికారులు ఈ వంక చూడరు?