
మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
కర్నూలు(సెంట్రల్): మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్(ఎన్సీఓఆర్డీ) సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. పొలాల్లో, అటవీ భూముల్లో గంజాయి సాగుపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. పట్టణాల శివారు ప్రాంతాల్లో ముళ్ల పొదలు, పాత భవనాలను తొలగించి విద్యుత్ దీపాలు వేయించాలన్నారు. పోలీసులతోపాటు 11 మంది జిల్లా అధికారులతో మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డీటీసీ శాంతకుమారి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్కుమార్, డీఎంహెచ్ఓ శాంతి కళ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా