వరిగిన ఆశలు | - | Sakshi
Sakshi News home page

వరిగిన ఆశలు

Oct 30 2025 7:51 AM | Updated on Oct 30 2025 7:51 AM

వరిగి

వరిగిన ఆశలు

● గన్నవరం నియోజకవర్గంలో ఐదు వేల ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో మినుము పంటలకు నష్టం వాటిల్లింది. గాలులకు విద్యుత్‌లైన్లు ధ్వంసమై విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ● అవనిగడ్డ నియోజకవర్గంలో వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం కలిగింది. చల్లపల్లి మండలంలో 3,662 ఎకరాల్లో వరి పైరు నేలవాలింది. 448 ఎకరాల్లో అరటి, బొప్పాయి, కూరగాయలు, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. నాగాయలంక మండలంలో 2,600 ఎకరాల్లో వరికి నష్టం కలిగింది. ఎదురుమొండి దీవిలోని జింకపాలెం రోడ్డు కృష్ణానదిలో కలిసిపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నాగాయలంక మండలంలో 25 గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ● పెనమలూరు నియోజకవర్గంలో పలు పంటలకు నష్టం వాటిల్లింది. పెనమలూరు మండలంలో 1448 హెక్టార్లలో చిరుపొట్ట, కంకిదశలో ఉన్న వరి పొలాలు నేలవాలాయి. కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లోని అనేక గ్రామాల్లో వరికి నష్టం వాటిల్లింది. నియోజకవర్గం వ్యాప్తంగా 30కిపైగా విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. దావులూరు, మద్దూరు, గొడవర్రు, ఉప్పలూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో 50 ఎకరాల్లో అరటి తోటలు, ఈడుపుగల్లు, మద్దూరు గ్రామాల్లో పది ఎకరాల్లో తమలపాకు తోటలు దెబ్బతిన్నాయి. ● పామర్రు నియోజకవర్గంలో తుపాను ప్రభావంతో పది వేల ఎకరాల్లో వరిపైరు నేలవాలింది. తోట్లవల్లూరు ప్రాంతంలో రెండు వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. కొమరవోలు శివారు గాంధీ ఆశ్రమంలో, పామర్రు జాతీయ రహదారిపై విద్యుత్‌ లైన్లు దెబ్బతిన్నాయి. ● గుడివాడ నియోజకవర్గంలో పలు చోట్ల భారీ వృక్షాలు కూలటంతో విద్యుత్‌ స్తంభాలు ధ్వంసం అయ్యాయి. ఈదురు గాలులు ప్రభావంతో 250 ఎకరాల్లో వరి పైరుకు నష్టంవాటిల్లింది. నందివాడ, గుడివాడ మండలాల్లో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ● పెడన నియోజకవర్గంలో 2,500 ఎకరాల్లో వరిపైరు నేలవాలింది. నాలుగు ఇళ్లు పూర్తిగా, 14 పూరి పాకలు, రేకుల షెడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 100కు పైగా విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ఐదు ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురయ్యాయి. కృత్తివెన్ను మండలంలో రోడ్లు ధ్వంసమై పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ● అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 27,382 ఎకరాల్లో వరికి, 1,015 ఎకరాల్లో అరటి, పసుపు, కంద, బొప్పాయి తదితర వాణిజ్య పంటలకు నష్టంవాటిల్లింది. వాణిజ్య పటలు సాగుచేస్తున్న రైతులు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు నష్టపోయారు. నాగాయలంక మండలం ఎదురుమొండి దీవిలో జింకపాలెం రోడ్డు పూర్తిగా కృష్ణా నదిలో కరిగిపోయింది.

మోంథా.. కన్నీటి వ్యథ

భారీ గాలులకు చిగురుటాకులా వణికిన కృష్ణా జిల్లా జిల్లాలో 1,15,892.5 ఎకరాల్లో దెబ్బతిన్న వ్యవసాయ, వాణిజ్య పంటలు 1,12,601.3 ఎకరాల్లో వరి పంటకు వాటిల్లిన నష్టం తుపాను శాంతించడంతో ఊపిరి పీల్చుకున్న జిల్లా ప్రజలు కొనసాగుతున్న విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులు సెల్‌టవర్లు పనిచేయక మూగనోము పట్టిన ఫోనులు

కంద కుళ్లే ప్రమాదం

పంట నష్టం ప్రాథమిక అంచనాలు ఇలా...

సాక్షి ప్రతినిధి, విజయవాడ: మోంథా తుపాను భారీ వర్షాలు, ఈదురు గాలలతో కృష్ణా జిల్లాను వణికించింది. ముఖ్యంగా లక్ష ఎకరాలకు పైగా వరి పంటను దెబ్బతీసి రైతులకు కన్నీరు మిగిల్చింది. బొప్పాయి, అరటి, కూరగాయ పంటలను తుడిచిపెట్టి ఉద్యాన రైతుల కష్టం కలిగించింది. తీరం వెంబడి వీచిన భారీ ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. 119 సబ్‌ స్టేషన్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో పలు పట్టణాలు, గ్రామాల్లో అంధకారం నెలకొంది. అధికారులు జిల్లా వ్యాప్తంగా 214 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసి 21,525 మందికి రక్షణ కల్పించారు.

అన్నదాతకు గుండెకోత

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తొలుత వాయుగుండంగా ఆ తరువాత మోంథా పెను తుపానుగా మారి జిల్లాపై విరుచుకుపడింది. తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షం, ఈదురు గాలులకు చిరుపొట్ట నుంచి, గింజ గట్టి పడే దశలో, కోతకు సిద్ధంగా ఉన్న వరిచేలు నేలవాలాయి. పైరు మీదుగా వర్షపునీరు ప్రవహిస్తుండటంతో చిరు పొట్ట, గింజ గట్టిపడే దశలో ఉన్న పొలాల్లో తాలు, తప్ప గింజలు ఏర్పడతాయని, మానుగాయ వచ్చి దిగుబడులు, నాణ్యత దిగజారుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టబడులు పెట్టామని, మరో 20 రోజుల్లో కోతలు చేపట్టాల్సిన తరుణంలో తుపాను తమ కష్టాన్ని కన్నీటిపాలు చేసిందని వాపోయారు.

నియోజకవర్గాల వారీగా నష్టం ఇలా..

మోంథా తుపానుతో కంద పంట మొత్తం నీటమునిగింది. పుట్టు విత్తనం రూ.7 వేల చొప్పున కొని ఎకరాకు సుమారు రూ. 1.50 లక్షలు వెచ్చించి సాగుచేపట్టా. ప్రస్తుతం కంద తోటలో నీరు నిలిచింది. దీని వల్ల దుంప పెరుగుదల నిలిచిపోతుంది. ఎక్కువ రోజులు నీరు నిలిస్తే దుంప పూర్తిగా కుల్లిపోతుంది. పెట్టుబడి మొత్తం నష్టపోవాల్సి వస్తుంది.

– కోసూరు వెంకటేశ్వరావు, కోసూరువారిపాలెం, కృష్ణాజిల్లా

జిల్లాలో 24 మండలాల పరిధిలోని 427 గ్రామాల్లో 5,6050 మంది రైతులకు సంబంధించి 1,15,892.5 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. 54,180 మంది రైతులు సాగుచేసిన వరి 1,12,601.3 ఎకరాల్లో నేలవాలి దెబ్బతింది. 720.5 ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతిని 566 మంది రైతులు నష్టపోయారు. 2462.5 ఎకరాల్లో మినుము దెబ్బతిని 1,249 మంది రైతులకు నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలకు సంబంధించి 2,229 మంది రైతులు 1397.2 ఎకరాల్లో సాగుచేస్తున్న అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిని రూ.73.45 కోట్ల నష్టం వాటిల్లింది. 119 సబ్‌స్టేషన్లు, 52 33 కేవీ ఫీడర్లు, 11 కేవీ ఫీడర్లు 471, 33 కేవీ స్తంభాలు 93, 11 కేవీ స్తంభాలు 353 దెబ్బతిని రూ.2 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 506 చెట్లు నేలకూలాయి. ఒక గెదే, మరో దూడ చనిపోయాయి. బుధవారం సాయంత్రానికి సైతం కొన్ని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు నోచుకోలేదు. అవనిగడ్డ నియోజకవర్గంలో సెల్‌ టవర్లు పనిచేయలేదు. దీంతో మంగళవారం ఫోన్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వరిగిన ఆశలు 1
1/2

వరిగిన ఆశలు

వరిగిన ఆశలు 2
2/2

వరిగిన ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement