
‘ఆ ఒక్క కిలోమీటర్’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు
న్యూస్రీల్
సాగు చేయలేక లీజుకిచ్చాం
ఐదు ఎకరాలు పాడైపోయింది
ఇలా చేస్తే పరిష్కారం..
కొనుగోలుదారులతో కిటకిట.. విజయవాడ ఘంటసాల మ్యూజిక్ కళాశాల ప్రాంగణంలో దుకాణాల వద్ద రద్దీ
విజయవాడరూరల్: ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు అండర్–19 రెజ్లింగ్ బాలికల (ఫ్రీ స్టైల్), బాలుర (గ్రీకో–రోమన్) రెజ్లింగ్ స్టేట్ మీట్ జరుగుతుందని నున్న జిల్లా పరిషత్ హైస్కూల్ పీడీ టి.విజయవర్మ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలోని అశోక్ ఫంక్షన్ హాలులో నిర్వహించే ఈ పోటీలకు రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి 250టీంల క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పోటీలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి కొండపల్లికి చెందిన బి. ప్రసాద్, బి. నాగసాయి యోక్షిత పేరిట రూ. 2,00,116 విరాళాన్ని ఆదివారం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకులు చందు శ్రీనివాస్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
వ్యాపారస్తులతో ముఖాముఖీ..
చిలకలపూడి(మచిలీపట్నం): దీపావళి పండుగ సందర్భంగా మచిలీపట్నంలోని కలెక్టరేట్లో 20వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కంకిపాడు: భారీ వర్షంతో వరి పైర్లు నేలవాలాయి. అల్పపీడన ప్రభావంతో ముసురు కొనసాగుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడన ప్రభావంతో శనివారం రాత్రి నుంచి వర్షం విడవకుండా కురుస్తోంది. ఆదివారం కూడా మోస్తరు వర్షం పడింది. వర్షానికితోడు తీవ్రమైన చలిగాలులు వీచాయి. దీంతో చిరుపొట్ట దశకు చేరిన వరిపైర్లు నేలవాలాయి. మండలంలోని కంకిపాడు, పునాదిపాడు, ఉప్పలూరు గ్రామాల్లో చాలా చోట్ల వరి పొలాలు నేలవాలి నీటిలో నానుతున్నాయి. వర్షం విడవకుండా కురుస్తుండటంతో చిరుపొట్ట దశలో, సుంకు దశలో ఉన్న పైర్లకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వీడని ముసురు..
వర్షంతో పాటు ముసురు కొనసాగుతోంది. రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పొలాల్లో నిలిచిన నీటిని పక్కనే ఉన్న పంట బోదెల్లోకి మళ్లించుకుని వరి కంకులు నీటిలో నానకుండా రైతులు జాగ్రత్త వహిస్తున్నారు. కంకి, చిరుపొట్ట దశలో వర్షంతో నష్టం జరుగుతుందని రైతులు చెబుతున్నారు.
జి.కొండూరు: సాగు నీరందించేందుకు తవ్విన కాలువ రైతుల పాలిట శాపంగా మారింది. పాలకుల నిర్లక్ష్యంతో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన వాగులకు అడ్డంగా కాలువ తవ్వి, వాగులలో వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతో రైతుల సాగు భూములు ముంపునకు గురవుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ముంపు బారిన పడి రైతులు నష్టపోతుంటే ప్రభుత్వాలు, స్థానిక పాలకులు చూసీ చూడనట్లు వదిలేయడంతో తీవ్ర నష్టం జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, విజయవాడ రూరల్ మండలాల పరిధిలోని కవులూరు, కొత్తూరు తాడేపల్లి గ్రామాల పరిధిలో తారకరామా ఎడమ కాలువకు ఆనుకొని ఉన్న రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.
సమస్యే ఇది..
ఇబ్రహీంపట్నంలోని థర్మల్ పవర్ స్టేషన్లో వినియోగించిన నీటిని తిరిగి కృష్ణా నది లోకి వెళ్లకుండా బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా ఈలప్రోలు గ్రామం వద్ద కుడి, ఎడమ కాలువకు మళ్లించి తారకరామా ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరందించడం లక్ష్యంగా 1982లో ప్రణాళిక రచించారు. కృష్ణాజిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, విజయవాడరూరల్, మైలవరం, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, ఆగిరిపల్లి, మండలాల పరిధిలోని 64 గ్రామాలకు చెందిన 56వేల ఎకరాలకు సాగునీరందించే విధంగా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో కుడికాలువ పొడవు 25.74కిలోమీటర్లు, ఎడమకాలువ పొడవు 51.27కిలోమీటర్లుగా నిర్ధారించారు. మొదటి దశ నిర్మాణంలో భాగంగా రూ.24.97కోట్ల అంచనాలతో.. కుడి కాలువు 6.250కిలోమీటర్ల తవ్వి రెండు పంపుహౌస్లు, ఎడమ కాలువ 8.079కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా కొత్తూరు తాడేపల్లి శివారులో 6.6కిలో మీటర్ల వరకు తవ్వి ఆపేశారు. ఈ మొదటి దశ పనులు 2004నాటికి పూర్తయ్యాయి. ఆ తర్వాత ఈ ఎత్తిపోతల పథకంలో కుడి కాలువ తవ్వకం, పంపుహౌస్ల నిర్మాణం కోసం రెండు దశల్లో పనులు జరిగినప్పటికీ ఎడమ కాలువ తవ్వకాన్ని మాత్రం చేపట్టలేదు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది.
వాగులకు అడ్డంగా ఎడమ కాల్వ
జి.కొండూరు మండల పరిధిలోని కవులూరు, విజయవాడ రూరల్ మండల పరిధిలోని కొత్తూరు తాడేపల్లి గ్రామాలకు ఎగువ నుంచి వచ్చే నల్లవాగు(బుడమేరువాగు), చిల్లవాగు, తాడేపల్లివాగు, తొమ్మండ్రంవాగుల ప్రవాహానికి అడ్డంగా తారకరామా ఎడమ కాలువను తవ్వారు. అయితే ఈ కాలువను ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తే వాగులలో వరద ప్రవాహం తారకరామా ఎడమ కాలువలో కలిసి ముందుకు సాగే వీలుండేది. అలా కాకుండా ఎడమ కాలువను 6.6కిలో మీటర్లు మాత్రమే తవ్వి వదిలేయడంతో పాటు, ఎగువ నుంచి వచ్చే వాగులలో వరద దిగువకు పోయేందుకు అడ్డంగా ఉన్న కాలువకు సైపన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎడమ కాలువకు ఎగువన ఉన్న వరిపొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ రెండు గ్రామాలకు చెందిన 400ఎకరాల భూమిని సాగు చేసే రైతులు తారకరామా ఎడమ కాలువ తవ్విన నాటి నుంచి అంటే దాదాపు 20ఏళ్లుగా నష్టపోతున్నారు. వరద నీరు పోయే మార్గం లేక నోటికాడకు వచ్చిన పైరు కుళ్లిపోవడం వంటి ఘటనలతో ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
దళిత వ్యతిరేకి చంద్రబాబును గద్దె దింపుదాం
తారకరామా ఎడమ కాలువను 6.6కిలో మీటర్లు మాత్రమే తవ్వి వదిలేసిన వైనం
అది కూడా వాగుల ప్రవాహానికి అడ్డంగా తవ్వకం
సైపన్లు సైతం ఏర్పాటు
చేయకపోవడంతో ఇబ్బందులు
వరద సమయంలో ముంపు
బారిన పడుతున్న వరి పొలాలు
కవులూరు, కొత్తూరు తాడేపల్లికి
చెందిన రైతులకు తీవ్ర నష్టం
ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి కొద్దిపాటి శ్రద్ధ చూపితే తమకు ముంపు కష్టాలు తీరతాయని ఇక్కడి రైతులు కోరుతున్నారు.
కొత్తూరు తాడేపల్లి గ్రామ శివారులో 6.6కిలోమీటరు వద్ద ఆపేసిన తారకరామా ఎడమ కాలువను ఒక కిలోమీటరు పొడగించి.. ఆ గ్రామ తుమ్మల చెరువులో కలిపితే, కాలువలో నీటి ప్రవాహం ముందుకు సాగి, ఎగువ నుంచి వచ్చే వరద తారకరామా ఎడమ కాలువ ద్వారా దిగువకు పోయే అవకాశం ఉంది.
లేదంటే ఎగువ నుంచి వచ్చే వాగుల వరద పోయేందుకు తారకరామా ఎడమ కాలువకు కిందగా సైపన్లు ఏర్పాటు చేసినా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
తారకరామా ఎడమ కాలువలో తూడు కాడ లేకుండా ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల సమస్య కొంతమేర పరిష్కారమవుతుంది.
తారకరామా ఎడమ కాలువను కొంత తవ్వి అసంపూర్తిగా వదిలేయడం వల్ల ఎగువ వాగుల ద్వారా వచ్చే వరద దిగువకు పోయేందుకు కాలువ అడ్డుగా ఉండడంతో పొలాలు మునిగిపోతున్నాయి. ఇరవై ఏళ్లుగా ఇదే సమస్యతో తీవ్ర నష్టాలు వస్తుండడంతో నాకు ఉన్న తొమ్మిది ఎకరాలను ఇటుక బట్టీల ఏర్పాటుకు లీజుకిచ్చాను.
– చెరుకూరి శ్రీనివాసరావు,
రైతు, కవులూరు గ్రామం
మా గ్రామ శివారులో నేను ఏడు ఎకరాలు కౌలుకి తీసుకొని వరి సాగు చేశాను. తారకరామా ఎడమ కాల్వ వల్ల వరద దిగువకు పోయే అవకాశం లేక పొలం అంతా మునిగిపోయింది. ఐదు ఎకరాలు ఎందుకూ పనికిరాకుండా పోయింది. పై నుంచి వాగులలో వచ్చే వరద పోయేలా చేస్తేనే పొలాలు సాగు చేయగలుగుతాం.
– తమ్మెట శ్రీహరి,
రైతు, కవులూరు గ్రామం

‘ఆ ఒక్క కిలోమీటర్’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు

‘ఆ ఒక్క కిలోమీటర్’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు