ఉరేసుకొని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకొని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

Oct 20 2025 9:38 AM | Updated on Oct 20 2025 9:38 AM

ఉరేసు

ఉరేసుకొని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

ఉరేసుకొని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య సీఐ కార్యాలయంలో సరెండర్‌ అయిన దుర్గారావు

పెనమలూరు: ఉరేసుకొని యనమలకుదురులో బీటెక్‌ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... బోసుబొమ్మ సెంటర్‌కు చెందిన నాగం ప్రభావతి, రాంబాబు, ఇద్దరు కుమారులతో ఉంటున్నారు. తల్లి నారాయణ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా పని చేస్తుంది. కాగా వారి పెద్ద కుమారుడు రవిప్రకాష్‌ (19) గంగూరులో బీటెక్‌ 2వ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తల్లి, సోదరుడు తిరువూరు ప్రార్థనలకు వెళ్లారు. ఇంటి వద్దే ఉన్న రవిప్రకాష్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణరానికి పాల్పడ్డాడు. రవిప్రకాష్‌ కోసం స్నేహితుడు సాయిరాం వెళ్లగా ఇంట్లో ఉరేసుకొని కన్పించాడు. వెంటనే ఈ సమాచారాన్ని రవిప్రకాష్‌ తల్లికి ఫోన్‌ ద్వారా తెలియజేశాడు. ఆత్మహత్యకు గల కారణం తెలియలేదు. ఈ ఘటన పై తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉరేసుకుని యువకుడి...

కృష్ణలంక(విజయవాడతూర్పు):ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న చెందిన ఘటన చోటుచేసుకుంది. రాణిగారితోట, తమ్మిన పోతురాజు వీధిలో నివాసం ఉంటున్న తమ్మిశెట్టి ఏసుబాబు (20) కూలీ పనులకు వెళ్తుంటాడు. మద్యానికి బానిసవడంతో ఆరోగ్యం క్షీణించింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన సోదరి అంజలి కూడా అనారోగ్యంతో ఉంది. తనతో పాటు తన సోదరి కూడా అనారోగ్యానికి గురైందని తరచూ మనస్తాపం చెందుతుండేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో రూమ్‌లోకి వెళ్లి పడుకున్నాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు తల్లి రూమ్‌లోకి వెళ్లి చూడగా రేకుల షెడ్డు ఐరన్‌ రాడ్‌కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు బాబు ఇచ్చిన ఫిర్యాదుపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పెనుగంచిప్రోలు:చిట్టీలు, గోల్డ్‌ స్కీంలతో డబ్బులు కట్టించుకుని మోసగించిన గ్రామానికి చెందిన చిన్నం చిన్న దుర్గారావు ఆదివారం జగ్గయ్యపేటలోని సీఐ కార్యాలయంలో లొంగిపోయాడు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దుర్గారావు లొంగి పోవటంతో ఏమి జరుగుతుందో అని బాధితులు ఎదురు చూస్తున్నారు.

ఉరేసుకొని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య 1
1/1

ఉరేసుకొని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement