వ్యర్థ పదార్థాలతో ఉపయోగకరమైన వస్తువుల తయారీపై మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఏకో క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణ అందించారు. విద్యార్థులు పర్యావరణ హిత వస్తువులు తయారు చేసి ప్రదర్శించారు. క ళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీస్తాయన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వ్యర్థ పదార్థాలను వినూత్న మార్గాల్లో ఉపయోగించేలా ప్రొత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. – కాగజ్నగర్టౌన్


