ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

కెరమెరి: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూ పాలని ఎస్పీ నితికా పంత్‌ సూచించారు. మండల కేంద్రంలోని స్టార్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆది వారం ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా మెడిలైఫ్‌ సూపర్‌ స్పెషాలిటీ, సన్‌ షైన్‌ హాస్పిటళ్ల సహకారంతో కెరమెరి పోలీసు ల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్యశిబి రానికి హాజరై మాట్లాడారు. ముందుస్తు పరీక్షలు చేయించుకుంటే వ్యాధులను ప్రారంభ ద శలోనే గుర్తించవచ్చని తెలిపారు. సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని సూచించారు. నిరుపేద గ్రామీణులకు వైద్యశిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. పోలీ సులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటార ని, ఏ సమస్య వచ్చినా ‘డయల్‌ 100’ కాల్‌ చేసి తెలుపాలని సూచించారు. శిబిరానికి కెరమెరి ఆర్‌ఎంపీ, పీఎంపీలు పూర్తి సహకారమందించగా, సీఐ సత్యనారాయణ, కెరమెరి, వాంకిడి ఎస్సైలు మధూకర్‌, మహేందర్‌, ఇన్‌చార్జి జిల్లా ఫార్మసీ అధికారి కలీల్‌ హుస్సేని, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement