కొరవడిన క్రమశిక్షణ..కరువైన పర్యవేక్షణ | - | Sakshi
Sakshi News home page

కొరవడిన క్రమశిక్షణ..కరువైన పర్యవేక్షణ

Mar 31 2026 7:26 AM | Updated on Mar 31 2026 7:26 AM

● 16 అక్టోబర్‌ 2023లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అధ్యాపకురాలు తిరుమలేశ్వరి (32) అప్పటి ఆర్సీవో వేధింపు కారణంగానే చెన్నూర్‌ పెద్ద చెరువులో పడి మృతిచెందారు. ఆమె బ్యాగ్‌లో మరణ వాంగ్మూలం లేఖ ద్వారా తెలిసింది. ● 23 జనవరి 2025లో మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన పదో తరగతి చదువుతున్న చెన్నూర్‌ మండలం బీరెల్లికి చెందిన ఆదర్శ్‌ (15) ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవనంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ● 6 ఫిబ్రవరి 2025లో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో మనోజ్‌గౌడ్‌పై ఏడుగురు విద్యార్థులు దాడి చేసి వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఈ విషయమై విచారణ జరిపి బాధ్యులను పాఠశాల నుంచి సస్పెండ్‌ చేస్తూ, ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించారు. ● 5 మార్చి 2026లో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చెన్నూర్‌కు చెందిన నాగవర్థన్‌ అనే విద్యార్థి రాత్రి హాస్టల్‌ నుంచి పారిపోయి కరీంనగర్‌ వెళ్లాడు. తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పోలీసులు విచారణ జరిపి విద్యార్థి కరీంనగర్‌లో ఉన్నాడని తెలుసుకుని వెళ్లి క్షేమంగా తల్లిదండ్రులకు చేర్చారు. ● 29 మార్చి 2026న చెన్నూర్‌ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని రాళ్లబండి శ్రీహిందు (14) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు టీచర్లను విధుల నుంచి తొలగించారు.

గురుకులాల్లో పిట్టల్లా రాలుతున్న విద్యార్థులు టీచర్ల వేధింపులే కారణమా? మూడేళ్లలో ముగ్గురు ఆత్మహత్య అయినా పట్టింపేది..?

చెన్నూర్‌: గురుకుల విద్యాలయాలు క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనకు పెట్టింది పేరు. గతంలో విద్యాబ్యాసం కఠినతరంగా ఉంటుందని ప్రచారం ఉంది. ఈ మధ్యకాలంలో క్రమశిక్షణ విద్యార్థుల్లో కొరవడిందా, ఉపాధ్యాయుల వేధింపులు ఎక్కువయ్యయా అనే అనుమానాలు రెకేత్తిస్తున్నాయి. వాచ్‌మెన్‌ నుంచి పాఠశాలల వరకు పకడ్బందీ పర్యవేక్షణ ఉంటుంది. విద్యార్థుల తినుబండారాలను తనిఖీ చేసి లోనికి పంపిస్తారు. పాఠశాలకు గడ్డిమందు వచ్చిందంటే పర్యవేక్షణ కొరవడిందని చెప్పుచ్చు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే విద్యార్థులు గాడితప్పుతున్నారా అనే అనుమానులకు తావిస్తున్నాయి. మూడేళ్లలో ముగ్గురు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడం పట్ల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. గురుకులాల్లో విద్యార్థులు బయటికి వెళ్లాలంటే కేవలం దసరా, సంక్రాంతి సెలవులు తప్ప మిగతారోజుల్లో మాత్రమే ఇళ్లకు పంపిస్తారు. నెలలో రెండు ఆదివారాల్లో తల్లిదండ్రులు వస్తే ఔటింగ్‌కు పంపిస్తారు. ఇన్ని నిబంధనలు ఉన్న విద్యార్థులు పిట్టల్లా రాలుతున్న విషయం తల్లిదండ్రులను కలవరపెడుతోంది. గురుకులాల్లో విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పడంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.

మృతుల వివరాలు ఇలా..

చెన్నూర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల

ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి

చెన్నూర్‌ గురుకుల పాఠశాలలోనే మూడేళ్లలో ముగ్గురు మృతువాత పడ్డారు. ఏడుగురు విద్యార్థులు సస్పెండ్‌కు గురయ్యారు. ఇవి వెలుగులోకి వచ్చిన సంఘటనలే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గురుకుల పాఠశాలలలో జరుగుతున్న వరుస ఘటనలపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. గురుకుల పాఠశాలల పై ప్రజలకు నమ్మకం ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఈ దిశగా ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

చెన్నూర్‌ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల, పాఠశాలలో అధ్యాపకురాలు, విద్యార్థిని, మైనార్టీ గురుకులంలో విద్యార్థి చొప్పున ముగ్గురు మృతి చెందారు. మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో తోటి విద్యార్థిని కొడుతూ సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన పది మంది విద్యార్థులు సస్పెన్స్‌కు గురికాగా, ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement