నగరం నుంచి పల్లెకు.. | - | Sakshi
Sakshi News home page

నగరం నుంచి పల్లెకు..

Dec 18 2025 7:35 AM | Updated on Dec 18 2025 7:35 AM

నగరం

నగరం నుంచి పల్లెకు..

వృథా కావొద్దని..

రెబ్బెన: ప్రజాస్యామ్య పద్ధతిలో నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు రాజ్యాంగం ఓటుహక్కు కల్పించింది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఓటు వృథా కావొద్దనే ఉద్దేశంతో హైదరాబా ద్‌ నుంచి గోలేటికి వచ్చా. ఎన్నికల జరిగిన ప్రతిసారి స్వగ్రామానికి వచ్చి వెళ్తుంటా.

– మద్దెల రవీందర్‌,

ప్రైవేటు ఉద్యోగి, హైదరాబాద్‌

ఓటు ద్వారా అవకాశం

రెబ్బెన: గోలేటి నుంచి వెళ్లి ఉద్యోగరీత్యా చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వచ్చా. గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఓటుహక్కు ద్వారా ఎన్నుకునే అవకాశం ఉంది. – అరుట్ల సాగర్‌,

ప్రైవేటు ఉద్యోగి, హైదరాబాద్‌

కరీంనగర్‌ నుంచి వచ్చా..

ఆసిఫాబాద్‌అర్బన్‌: కరీంనగర్‌లో డిగ్రీ చదువుతున్న. ఓటుహక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆసిఫాబాద్‌కు వచ్చా. రాజంపేటలో ఓటు వేసిన. ఎంత దూరంలో ఉన్న ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును వినియోగించుకోవాలి.

– టి.రమ్య, డిగ్రీ విద్యార్థిని

నగరం నుంచి పల్లెకు.. 1
1/2

నగరం నుంచి పల్లెకు..

నగరం నుంచి పల్లెకు.. 2
2/2

నగరం నుంచి పల్లెకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement