పోటెత్తి.. ఓటేసిన పల్లెజనం | - | Sakshi
Sakshi News home page

పోటెత్తి.. ఓటేసిన పల్లెజనం

Dec 16 2025 11:50 AM | Updated on Dec 16 2025 11:50 AM

పోటెత్తి.. ఓటేసిన పల్లెజనం

పోటెత్తి.. ఓటేసిన పల్లెజనం

● దహెగాం మండలంలో 24 పంచాయతీలు ఉండగా ఇక్కడ 12 పంచాయతీల్లో 90 శాతానికి మించి పోలీంగ్‌ నమోదు కావడం గమనార్హం. బీబ్రాలో 91 శాతం, బామానగర్‌ 91, బొర్లకుంట 91, చినరాస్పెల్లి 93, గిరవెల్లి 92, హత్తిని 93, కల్వాడ 93, ఇట్యాల 93, కర్జి 94, కోత్మీర్‌ 91, పెసరికుంట 92, మొట్లగూడ 92 శాతం నమోదైంది. ● చింతలమానెపల్లి మండలంలో 19 పంచా యతీలు ఉన్నాయి. ఆడెపల్లి 92, దిందా 90, కర్జెల్లి 94, లంబడిహేటి 91 శాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ● కౌటాల మండలంలో 20 పంచాయతీలు ఉండగా.. ఇక్కడ ఐదు పంచాయతీల్లో 90 శాతం దాటింది. నాగెపల్లిలో 92 శాతం, శీర్షా 92, తాటిపల్లి 93, తాటినగర్‌ 93, వీరవెల్లి 91 శాతం నమోదైంది. ● పెంచికల్‌పేట్‌ మండలంలో 12 పంచాయతీ లు ఉన్నాయి. అగర్‌గూడలో 92 శాతం, చె డ్వాయిలో 91 శాతం, దర్గోపల్లి 95 శాతం, కొండపల్లి 90, మురళీగూడ 91, పెంచికల్‌పేట్‌ 93, పోతెపల్లి, ఎల్కపల్లి, ఎల్లూర్‌ పంచాయతీల్లో 90 శాతం దాటింది. ● బెజ్జూర్‌ మండలంలో 22 జీపీలు ఉన్నాయి. ఒక్క చోటకూడా పోలింగ్‌ 90 శాతానికి మించలేదు. కాటెపల్లి, సోమిని, పెద్ద సిద్దాపూర్‌లో మాత్రం 89 శాతం నమోదైంది.

రెండో విడతలో భారీగా పోలింగ్‌శాతం పలు పంచాయతీల్లో 90శాతానికి పైగా నమోదు

దహెగాం(సిర్పూర్‌): జిల్లాలోని ఆరు మండలాల్లో ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పల్లె జనం పోటెత్తి ఓటువేశారు. దహెగాం, బెజ్జూర్‌, సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్‌ మండలాల్లో భారీగా పోలింగ్‌శాతం నమోదైంది. 1,31,278 మంది ఓటర్లకు 1,13,733 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 86.64 శాతం పోలింగ్‌ నమోదైంది. అ ధికారులు విస్తృతంగా అవగాహన క ల్పించడంతో పలు పంచాయతీల్లో 90 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది.

కేంద్రాలకు క్యూకట్టి..

మొదటి విడత ఎన్నికలు జరిగిన గిరిజన పల్లెల్లో చలి ప్రభావంతో ఉదయం మందకొడిగా సాగింది. అయితే రెండో విడతకు మాత్రం ఉదయం నుంచే పలు కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. ఇక ఉదయం 9గంటల తర్వాత నుంచి భారీగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థులు సైతం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించ డం కూడా పోలింగ్‌కు పెరిగేందుకు కారణమైంది. అయితే పెరిగిన ఓటింగ్‌శాతం కొందరికి మేలు చేయగా, మరికొందరికి మాత్రం చేటు చేసింది.

అత్యధికం దహెగాం.. అత్యల్పం బెజ్జూర్‌

మండలాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా దహెగాంలో 90.44 శాతం పోలింగ్‌ నమోదైంది. పెంచికల్‌పేట్‌ 90.26 శాతం ఉండగా, అత్యల్పంగా బెజ్జూర్‌లో 83.70 శాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement