
పోడు కోసం పోరు
తాండూర్: దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుంటు న్న తమకు వాటిపై హక్కులు కల్పించాల ని రైతులు పోరుబాట పట్టారు. కుమురంభీం ఆసిఫాబాద్ జి ల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన సుమారు 40మంది రైతులు మూడురోజుల క్రితం చేపట్టిన పాదయాత్ర గురువారం రాత్రి తాండూర్కు చేరుకుంది. మండలంలోని రేపల్లెవాడ సమీపంలోని శ్రీరామ జిన్నింగ్ మి ల్లులో సేద తీరి న అనంతరం శుక్రవారం తెల్లవారుజామున రైతులు తమ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా గ్రామ శివారులోని సుమారు 1,200 ఎకరాలను సాగు చే సుకుంటూ 600 కుటుంబాలవాళ్లం జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అటవీశాఖ అధికా రులు వాటిని సాగు చేసుకోకుండా అడ్డుకున్నారని వాపోయారు. తమకు న్యాయం చేసి భూ హక్కు ప త్రాలు ఇచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నా రు. హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి సీ ఎం రేవంత్రెడ్డి, అటవీశాఖ మంత్రి, అధికారులకు తమ గోడు చెప్పుకొంటామని వారు పేర్కొన్నారు.