
వెంటనే అరెస్టు చేయాలి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ మనోజ్కుమార్పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డిపో గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు టి.దివాక ర్ మాట్లాడుతూ చిల్లర విషయంలో కండక్టర్ మనోజ్పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడడంతో గాయాలయ్యాయని తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. కార్యక్ర మంలో కార్మికులు అబ్దుల్, ఉమేశ్, ముతా ల్, అనంత్రావు తదితరులు పాల్గొన్నారు.