
కార్మికుల డిమాండ్లకు సింగరేణి అంగీకారం
● క్లర్క్ పోస్టుల భర్తీపై స్పష్టత ● గుర్తింపు సంఘం అధ్యక్షుడు వి.సీతారామయ్య
శ్రీరాంపూర్: కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య తెలిపారు. నస్పూర్ ప్రెస్క్లబ్లో ఆదివారం మాట్లాడారు. ఈ నెల 27న సింగరేణి డైరెక్టర్ (పర్సనల్) స్థాయిలో జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలి పారు. గతేడాది 360 క్లర్క్ పోస్టుల కోసం ఇంటర్న ల్ అభ్యర్థుల నుంచి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, యాక్టింగ్ క్లర్క్లు వేసిన కోర్టు కేసు కారణంగా పరీక్షలు నిర్వహించలేదని యాజమాన్యం తెలిపిందన్నారు. ముందుగా ఈ పోస్టులను భర్తీ చేసి, మిగిలిన ఖాళీలను యాక్టింగ్ క్లర్క్లతో భర్తీ చేయాలని యూనియన్ కోరగా, యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. కంపెనీ ఉద్యోగులు ఉన్నత విద్య కోసం నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో ఉన్నత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా ఎన్వోసీ జారీకి యాజమాన్యం అంగీకరించిందన్నారు. గని ప్రమాదంలో మృతిచెందిన వారి డిపెండెంట్లకు డిప్లొమా, బీటెక్ వంటి టెక్నికల్ అర్హతలకు తగిన ఉద్యోగాలు ఇస్తున్నప్పటికీ, డిగ్రీ పూర్తిచేసిన వారికి తగిన ఉద్యోగాలు లభించడం లేదని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనిపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు తెలిపారు.
సెక్యూరిటీ గార్డు ఖాళీల భర్తీపై చర్చ..
సెక్యూరిటీ గార్డు ఖాళీల భర్తీతోపాటు ఇతర డిమాండ్లను కూడా సమావేశంలో చర్చించినట్లు సీతారామ య్య తెలిపారు. మొదటి స్ట్రక్షరల్ సమావేశంలో అంగీకరించిన కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. మారు పేర్ల సమస్య పరిష్కారానికి ముందడుగు వేస్తూ, కంపెనీ ప్రభు త్వ అడ్వొకేట్ జనరల్కు లేఖ రాసినట్లు వెల్లడించా రు. త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, ఉపాధ్యక్షుడు కొట్టె కి షన్రావు, నాయకులు ప్రసాద్రెడ్డి, నాగభూషణం, మురళిచౌదరి, నర్సింగరావు, ఎం.సారయ్య, ఆకుల లక్ష్మణ్, నవీన్రెడ్డి పాల్గొన్నారు.