యూరియా దందా! | - | Sakshi
Sakshi News home page

యూరియా దందా!

Jun 30 2025 4:17 AM | Updated on Jun 30 2025 4:17 AM

యూరియ

యూరియా దందా!

చిత్రంలో కనిపిస్తున్న రైతు పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూర్‌ గ్రామానికి చెందిన కుకిడే శేఖర్‌. ఆరు ఎకరాల్లో వరి, పత్తి పంటలు సాగు చేస్తున్నాడు. పదిరోజులుగా యూరియా కోసం ఎదురుచూస్తున్నా ఒక్క బస్తా దొరకడం లేదు. ప్రైవేటు వ్యాపారులు ఒక్కో బస్తాకు రూ.450 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏఆర్‌ఎస్‌కే, పీఏసీఎస్‌ల ద్వారా గ్రామాల్లో యూరియా సరఫరా చేయాలని కోరుతున్నాడు.

పెంచికల్‌పేట్‌(సిర్పూర్‌): వానాకాలం సీజన్‌లో పంటలు సాగుచేస్తున్న రైతులకు ఎలాంటి కొరత లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ఓ వైపు ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థి తి భిన్నంగా ఉంది. రైతుల అవసరాన్ని ఆసరాగా చే సుకున్న కొందరు వ్యాపారులు వ్యవసాయశాఖ అధికారులతో కలిసి యూరియా దందాకు తెరలేపా రు. పెంచికల్‌పేట్‌ మండలంలో సుమారు 15వేల ఎకరాల విస్తీర్ణంలో వరి, పత్తి పంటలు సాగువున్నా యి. అన్నదాతలకు హాకా(హైదరాబాద్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ అసోసియేన్‌), ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రం, డీసీఎంఎస్‌ల ద్వారా సబ్సిడీ కింద యూరి యా అందిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి తన హాకా సెంటర్‌ ద్వారా పెద్ద ఎత్తున యూరియా దిగుమతి చేసుకుని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినట్లుగా తెలు స్తోంది. స్థానిక రైతులకు సుమారు 1300 టన్నులు యూరియా అవసరం ఉండగా.. ఇప్పటికే 620 ట న్నులు మండలానికి చేరినా నేటికీ రైతులకు మాత్రం అందలేదు.

అధికారుల ప్రేక్షక పాత్ర..

రైతులకు కేంద్రాల ద్వారా అందిస్తున్న యూరియా వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎరువు ల వివరాలను సంబంధిత ప్రోఫార్మా ప్రకారం ఆ ధార్‌ నంబరుతో సహా నమోదు చేయాలి. అమ్మకా ల్లో నిబంధనల ఉల్లంఘన బహిరంగంగానే జరుగుతున్నా వ్యవసాయశాఖ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తుండడంపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సంబంధిత అధికారులు వ్యాపారులతో కుమ్మకై ్క యూరియాను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారని రై తులు ఆరోపిస్తున్నారు. ఎరువుల దుకాణాల్లో ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పా ల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డి మాండ్‌ చేస్తున్నారు.

పెంచికల్‌పేట్‌ మండలానికి చేరిన యూరియా స్టాక్‌(టన్నుల్లో)

ఎల్కపల్లి హాకా కేంద్రం 160

చేడ్వాయి హాకా కేంద్రం 40

ఏఆర్‌ఎస్‌కే కేంద్రం 120

డీసీఎంఎస్‌ ఎల్కపల్లి కేంద్రం 160

డీసీఎంఎస్‌ కొండపల్లి కేంద్రం 80

డీసీఎంఎస్‌ చేడ్వాయి కేంద్రం 60

ఏఆర్‌ఎస్‌కే, పీఏసీఎస్‌లలో స్టాక్‌ నిల్‌

‘హాకా’ల ద్వారా అమ్మకాలు

అక్రమ విక్రయాలకు తెరలేపిన ఓ వ్యాపారి!

అధికారుల పర్యవేక్షణ లేక నష్టపోతున్న రైతులు

హాకాతో దందా..

పెంచికల్‌పేట్‌ మండలంలోని రైతులకు ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రం ద్వారా రూ.270కి బస్తా యూరియా సరఫరా చేస్తున్నారు. ఒకే ఏఆర్‌ఎస్‌కే సెంటర్‌ ద్వారా రైతులకు సరిపడా యూరియా అందకపోవడంతో వ్యాపారి తన పలుకుబడితో దందాకు తెరలేపాడు. వ్యవసాయశాఖ అధికారుల సహకారంతో తన హాకా సెంటర్‌ ద్వారా 160 టన్నుల యూరియా దిగుమతి చేసుకున్నాడు. ఇతర కేంద్రాలకు ఎరువులు దిగుమతి కాకుండా ఒత్తిడి చేసి కృత్రిమ కొరత సృష్టించాడు. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో బస్తా సుమారు రూ.380 నుంచి రూ.450 రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఇటీవల ఇదే ఘటనపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ హకా కేంద్రాల ద్వారా జరుగుతున్న అక్రమ దందాపై విమర్శలు చేశారు.

తనిఖీలు నిర్వహిస్తున్నాం

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నాం. స్టాక్‌, విక్రయాల రిజిస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే యూరియా విక్రయించాలి. కొంతమంది వ్యాపారులు తమ విక్రయాలకు సంబంధించిన డాటా ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా అధిక ధరలకు యూరియా విక్రయిస్తే దుకాణాల లైసెన్సు రద్దు చేస్తాం.

– మనీషా, ఏవో, పెంచికల్‌పేట్‌

యూరియా దందా!1
1/1

యూరియా దందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement