రావి శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు | - | Sakshi
Sakshi News home page

రావి శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు

Jun 30 2025 4:17 AM | Updated on Jun 30 2025 4:17 AM

రావి శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు

రావి శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు

కాగజ్‌నగర్‌టౌన్‌: కాంగ్రెస్‌ సిర్పూర్‌ ని యోజకవర్గ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్‌పై ఆ పార్టీ అధిష్టానం చ ర్యలు తీసుకుంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆరేళ్లపాటు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు గతంలో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కపై విమర్శలు చేశారని, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు ఫిర్యాదు చేశారు. స్పందించిన టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్‌ చిన్నారెడ్డి రావి శ్రీనివాస్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈ నెల 28లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. గడువు ముగిసినా రావి శ్రీనివాస్‌ నుంచి వివరణ రాకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

‘గ్రూపు రాజకీయాలను ప్రశ్నించడంతోనే..’

సస్పెన్షన్‌పై రావి శ్రీనివాస్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. సీతక్కను తానెప్పుడూ దూషించలేదన్నారు. ఈ ప్రాంత సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. గ్రూపు రాజకీయాలను ప్రశ్నించడంతోనే తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించారని ఆరోపించారు. దీనిపై తనకు ఎలాంటి బాధ లేదని, ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement