
సీతక్కకు గిరిజనశాఖ కేటాయించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు తెలిసిన ఎమ్మెల్యే సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ కేటాయించాలని ఆది వాసీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోవ ఇందిర అన్నారు. మండలంలోని మోడి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చాక మౌలిక వసతులు, రోడ్డు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. గిరిజనుల జీవన స్థితిగతులపై అనుభవం ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్కకు మంత్రి పదవి ఇస్తే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.