‘అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌’ | - | Sakshi
Sakshi News home page

‘అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌’

May 4 2025 6:59 AM | Updated on May 4 2025 6:59 AM

‘అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌’

‘అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌’

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఎన్నికల ముందు అబద్ధపు హా మీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు వి శ్వసించడం లేదని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 90 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. అధికారంలోకి రాగానే కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిందన్నారు. కార్యక్రమంలో రెబ్బెన తహసీల్దార్‌ రామ్మోహన్‌రావ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, రెబ్బెన పీఏసీఎస్‌ చైర్మన్‌ కార్నాతం సంజ, తదితరులు పాల్గొన్నారు.

అదనపు తరగతిగదుల నిర్మాణానికి భూమిపూజ

ఆసిఫాబాద్‌అర్బన్‌: మండలంలోని వావుదం టీడబ్ల్యూపీఎస్‌ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి శనివారం భూమిపూజ చేశారు. ఉట్నూర్‌ ఐటీడీఏ నిధుల నుంచి మంజూరైన రూ.13.50 లక్షల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతోనే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ పాఠశాలకు సక్రమంగా వెళ్లి చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, మాజీ ఉప సర్పంచ్‌ లింబారావ్‌, ధర్మారావ్‌, సాలిక్‌రావ్‌, నాందేవ్‌, కిస్మత్‌రావ్‌, ఐటీడీఏ ఏఈ నిజామొద్దీన్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement