కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన

May 3 2025 11:23 AM | Updated on May 3 2025 11:23 AM

కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన

కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన

రెబ్బెన(ఆసిఫాబాద్‌): కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పర్యటనకు సంబంధించి కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్‌బాబు పరిశీలించారు. రూ.3,500 కోట్లతో నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారిని ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభాస్థలి, హెలిప్యాడ్‌ ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బహిరంగ సభకు హాజరయ్యే ప్రముఖులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. వాహనాల పార్కింగ్‌, భోజ నం, తాగునీటి వసతులు కల్పిచాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, అడిషనల్‌ ఎస్పీ ప్రభాకర్‌రావు, ప్రాజెక్టు డైరెక్టర్‌ మణికుమార్‌, తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు, ఎస్సై చంద్రశేఖర్‌, డీఈ లక్ష్మీనారాయణ, ఏఈ ఇమ్రాన్‌, ఈవెంట్‌ మేనేజర్‌ అనూప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement