కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటాం

May 26 2025 11:59 PM | Updated on May 26 2025 11:59 PM

కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటాం

కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటాం

దహెగాం(సిర్పూర్‌): కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటామని కాంగ్రెస్‌ పార్టీ పరిశీలకుడు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రియాజ్‌ అలీ, ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. మండలంలోని ఇట్యాల గ్రామంలో సోమవారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు అధ్యక్షతన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామ, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ సిడాం గణపతి, మాజీ జెడ్పీటీసీ రామారావు, నాయకులు గజ్జెల సురేశ్‌, బ్రహ్మయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement