
బాధితులకు సత్వర న్యాయం
ఆసిఫాబాద్అర్బన్: ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు సత్వర న్యాయం చేస్తామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవా రం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీదారుల నుంచి 12 ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా పోలీ స్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి సమస్యలు చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. అధికారుల దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.