
క్రీడాకారిణికి ఆర్థికసాయం
ఆసిఫాబాద్అర్బన్: ఆసియా కప్ అత్యాపత్యా పోటీలకు ఎంపికై న క్రీడాకారిణి గెడం సుహాసినిని జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి శాలువాతో సన్మానించారు. రూ.25 వేల ఆర్థికసాయం అందించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ గురుకుల పాఠశాలలో సెకండియర్ చదువుతున్న సుహాసిని ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు కేరళలో జాతీయస్థాయి సీనియర్ ఫెడరేషన్ అత్యాపత్యా పోటీల్లో ప్రతిభ చూపింది. ఈ నెల 30 నుంచి జూన్ 1 వరకు వెస్ట్ బెంగాల్లో జరిగే ఆసియా కప్ పోటీల్లో పాల్గొననుంది. కార్యక్రమంలో నాయకులు కలాం, రవీందర్, ఖోఖో ఇండియా కోచ్ రాకేష్ పాల్గొన్నారు.