
కొనుగోళ్లలో అక్రమాలు!
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లావ్యాప్తంగా సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న రెండు గ్రామాల రైతుల నుంచి రూ.18 కోట్లకుపైగా విలువైన పత్తి కొనుగో ళ్లు చేసినట్లు విజిలెన్స్ అధికారుల అంతర్గతంగా ని ర్వహించిన విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలి సింది. ఈ నేపథ్యంలో వారం రోజుల కిందట జిల్లాలో పని చేసిన, చేస్తున్న కార్యదర్శులు, ఏఈవోలు, కంప్యూటర్ ఆపరేటర్లను పిలిపించి విచారించారు. అలాగే పలువురు ప్రైవేటు పత్తి వ్యాపారులను సైతం పిలిచి వారి రికార్డులు పరిశీలించినట్లు తెలుస్తోంది.
సీసీఐకి 18,28,900 క్వింటాళ్ల పత్తి..
గత వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేసినట్లు అంచనా. పత్తి మద్దతు ధర రూ.7,521గా సీసీఐ నిర్ణయించింది. జిల్లాలో 68,267 మంది రైతులు నేరుగా సీ సీఐకి 18,28,900 క్వింటాళ్ల పత్తిని విక్రయించినట్లు సీసీఐ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రైవేటు జిన్నింగ్ మిల్లు వ్యాపారులు 1,33,800 క్వింటాళ్ల ప త్తిని కొనుగోలు చేశారు. అయితే ఇక్కడే బడా జి న్నింగ్ వ్యాపారులు సీసీఐ అధికారులతో చేతులు క లిపి అక్రమ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ప్రై వేటులో తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన సరుకునే తిరిగి రూ.7,521 ధర చొప్పున సీసీఐకి విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది.
విచారణ చేపట్టిన విజిలెన్స్..
భారీస్థాయిలో అక్రమ కొనుగోళ్లు జరిగాయన్న ఫిరా దులు అందడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. జిల్లాలో పత్తి కొనుగోళ్ల సమయంలో పనిచేసిన సీసీఐ అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు, వ్యవసాయ అధికారులు, ఆపరేట ర్లను వారం రోజుల కిందట కరీంనగర్ కార్యాలయానికి పిలిచి విచారించారు. పలు రికార్డులు పరిశీలించి.. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయించారు. అదే సమయంలో రూ.18 కోట్లకు పైగా విలువైన పత్తిని అక్రమంగా కొనుగోలు చేసిన ఇద్దరు ప్రైవేటు జిన్నింగ్ వ్యాపారులకు సంబంధించిన రికార్డులను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పక్కాగా అక్రమాలు జరినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
సీసీఐ కొనుగోలు కేంద్రానికి విక్రయానికి వచ్చిన పత్తి వాహనాలు(ఫైల్)
వ్యాపారులు, సీసీఐ అధికారులు కుమ్మక్కు!
రూ.18 కోట్లకుపైగా విలువైన పత్తి అక్రమంగా కొనుగోలు
విజిలెన్స్ విచారణలో వెలుగుచూసిన బాగోతం
వివరాలు సేకరిస్తున్న అధికారులు
బాగోతం జరిగిందిలా...
జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసినా.. అసలు పంట ఎన్ని ఎకరాల్లో వేశారనేది నిర్ధారణ జరగకపోవడంతో అక్రమాలకు తావిచ్చినట్లు సమాచారం. ఆన్లైన్లో కచ్చితమైన పంట వివరాలు నమోదు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు దానిని తమ ఆదాయ వనరుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 17 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఇందులో జిల్లా కేంద్రంలో ఉన్న ఇద్దరు వ్యాపారులు ఈ అక్రమ కొనుగోళ్ల వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారు. ఏటా పత్తి కొనుగోళ్ల సమయంలో సీసీఐ, వ్యవసాయ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లకు భారీ మొత్తంలో మామూళ్లు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆ ఇద్దరు వ్యాపారులే తాజాగా జరిగిన కొనుగోళ్లలోనూ భారీగా అక్రమాలకు పాల్పడి రూ.కోట్లు తమ జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ అధికారులు జారీ చేసే పంట నిర్ధారణ పత్రాలు, టీఆర్ల ఆధారంగా దోపిడీకి తెరతీసినట్లు సమాచారం. కొందరు రైతుల పేరిట రూ.18 కోట్లకుపైగా విలువచేసే పత్తిని కొనుగోలు చేసి సీసీఐకి విక్రయించినట్లు తెలుస్తోంది.
వివరాలు తెలుసుకున్నారు
పత్తి కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను సీసీఐ, కార్యదర్శులు, వ్యవసాయ అధికారులు, ఆపరేటర్ల నుంచి విజిలెన్స్ అధికారులు అడిగి తెలుసుకున్న మాట వాస్తవమే. అయితే కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు నా దృష్టికి రాలేదు. విజిలెన్స్ అధికారుల విచారణలో ఆ వివరాలు వెలుగులోకి వస్తాయి. వారి తుది నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయి.
– అష్పాక్ అహ్మద్, ఏడీ, మార్కెటింగ్ శాఖ