రాజుపేటలో ‘రాజు’ ఎవరో..? | - | Sakshi
Sakshi News home page

రాజుపేటలో ‘రాజు’ ఎవరో..?

Dec 8 2025 7:48 AM | Updated on Dec 8 2025 7:48 AM

రాజుపేటలో ‘రాజు’ ఎవరో..?

రాజుపేటలో ‘రాజు’ ఎవరో..?

● ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల గ్రామంలో పోరు రసవత్తరం ● సర్పంచ్‌ బరిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు

● ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల గ్రామంలో పోరు రసవత్తరం ● సర్పంచ్‌ బరిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు

సాక్షిప్రతినిధి, ఖమ్మం : కూసుమంచి మండలం రాజుపేట పంచాయతీలో సర్పంచ్‌ పోరు రసవత్తరంగా ఉంది. ఇది మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యల స్వగ్రామం. ఈ పంచాయతీ ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. 1995లో పెరికసింగారం పంచాయతీ నుంచి విడిపోయి రాజుపేట గ్రామ పంచాయతీగా ఏర్పడింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏకగ్రీవం కాలేదు. అయితే ఈ దఫా సర్పంచ్‌ బరిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామం కావడం, ఇది రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ఉండడంతో ఇక్కడ విజయం ఏ పార్టీ మద్దతుదారుడిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.

ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో..?

రాజుపేట గ్రామంలో 756 మంది ఓటర్లు ఉన్నారు. 1995 నుంచి పరిశీలిస్తే ఈ గ్రామంలో తొలుత సర్పంచ్‌గా కంపసాటి గోవింద్‌ (సీపీఎం), ఆ తర్వాత దారావత్‌ వెంకట్రాం (టీడీపీ), మోదుగు జ్యోతి (టీడీపీ), కందాల సురేందర్‌రెడ్డి (కాంగ్రెస్‌), వాసంశెట్టి అరుణ (కాంగ్రెస్‌) సర్పంచ్‌లుగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థులుగా కాంగ్రెస్‌ మద్దతుతో కొర్రా రమేష్‌, బీఆర్‌ఎస్‌ బలపర్చిన బానోతు మహేష్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా కొర్రా నాగులు పోటీలో ఉన్నారు. 8 వార్డుల్లో ఏడు వార్డులకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మద్దతుదారులు పోటీలో నిలిచారు. 8వ వార్డులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తో పాటు మరో అభ్యర్థి బరిలో ఉన్నారు. రెండో విడతలో భాగంగా ఈనెల 14న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ శనివారం ముగియడంతో ఈ పంచాయతీలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఓవైపు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మద్దతు, మరో వైపు మంత్రి మద్దతు ఉన్న అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఈగ్రామ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement