మరో 45మంది టీచర్ల సర్దుబాటు | - | Sakshi
Sakshi News home page

మరో 45మంది టీచర్ల సర్దుబాటు

Oct 17 2025 5:54 AM | Updated on Oct 17 2025 5:54 AM

మరో 45మంది టీచర్ల సర్దుబాటు

మరో 45మంది టీచర్ల సర్దుబాటు

ఖమ్మం సహకారనగర్‌: పలు ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్‌ టీచర్లను కొరత తీర్చేందుకు అదనంగా ఉన్న చోట్ల నుంచి కేటాయిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టారు. తాజాగా మరో 45మందిని వివిధ పాఠశాలలకు కేటాయిస్తూ అదనపు కలెక్టర్‌, డీఈఓ డాక్టర్‌ పి.శ్రీజ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వీరంతా నూత న స్థానాల్లో వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.

ఏఎంఓగా ప్రభాకర్‌రెడ్డి

విద్యాశాఖలో అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌(ఏఎంఓ)గా పెసర ప్రభాకరరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన అదనపు కలెక్టర్‌ పి.శ్రీజను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ప్రభాకర్‌రెడ్డికి పలువురు హెచ్‌ఎంలు, వివిధ సంఘాల బాధ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement