
పతక విజేతలను అభినందించిన సీపీ
ఖమ్మంక్రైం: రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు వివిధ సందర్భాల్లో రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పోలీస్ సేవా పతకాలకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలువురు ఉద్యోగులు ఎంపికయ్యారు. కమిషనరేట్ నుంచి 82మంది పతకాలు అందుకోగా పోలీసు కమిషనర్ సునీల్దత్ మంగళవారం వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో విధులు నిర్వర్తిస్తూ మెరుగైన పనితీరు కనబర్చాలని సూచించారు. పతకాలు అందుకున్న వారిలో అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు, ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు తదితరులు ఉండగా, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, కామరాజు పాల్గొన్నారు.