
అంధుల పాఠశాలకు ప్రణాళిక రూపొందించండి
ఖమ్మం సహకారనగర్ : అంధుల పాఠశాల నిర్మాణా నికి పక్కా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, జిల్లా విద్యాశాఖ అధికారులతో తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంధుల పాఠశాలలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని పాఠశాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. విద్యతో పాటు కంప్యూటర్ స్కిల్స్ అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన లిపి, పుస్తకాలు అందుబాటులో ఉంచాలని, పాఠశాలల్లో సెన్సరీ రూమ్, గార్డెన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నాణ్యమైన వస్తువులు మాత్రమే వినియోగించాలన్నారు. మలక్పేటలోని అంధుల పాఠశాలను, దేవనార్ పాఠశాలను అధికారులు సందర్శించి.. జిల్లాలో చిన్న స్థాయిలో అంధుల పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని చెప్పారు. సమావేశంలో సీఎంఓ ప్రవీణ్, స్పెషల్ ఎడ్యుకేటర్ రాకేష్, పంచాయతీరాజ్ ఏఈ చిరంజీవి పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ ఆదేశం