
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్
ఖమ్మంక్రైం: నగరంలో గంజాయి విక్రయించేందుకు వచ్చిన ములుగు జిల్లావాసులు ముగ్గురిని త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు జిల్లాకు చెందిన కుర్రా మోహన్, బోడ మురారి, బోడ గౌతమ్ శ్రీనివాసనగర్లోని కాల్వకట్ట ప్రాంతంలో ఉంటున్నారు. వారు గంజాయివిక్రయంతోపాటు సేవించటానికి అల వాటు పడి ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన వినోద్కుమార్, జాడి రాకేశ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి ఖమ్మం తీసుకొచ్చారు. చర్చికౌంపౌండ్ బ్రిడ్జి కింద ఎస్ఐ కొండల్రావు తనిఖీలు చేపడుతుండగా వారు ద్విచక్రవాహనంపై వెళ్తూ పట్టుబడ్డారు. వారి వద్ద 1,100 గ్రాముల గంజాయి లభ్యమైంది. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
యూరియా తిని 11 మేకల మృతి
ములకలపల్లి: యూరియా తినడంతో 11 మేకలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని మంగపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మంగపేట గ్రామానికి చెందిన వాడె దారయ్యకు చెందిన మేకలు గ్రామశివారు లో మేతకు వెళ్లాయి. ఈ క్రమంలో ఓ రైతు ట్రాక్టర్లో యూరియా బస్తాలు తరలిస్తుండ గా ఒకటి రోడ్డుపై పడటంతో యూరియా కిందపడింది. సమీపంలో ఉన్న 11 మేక లు యూరియా తిని మృతిచెందాయి. సుమారు రూ.1.5 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపాడు.